నారా రోహిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రతినిధి-2’. మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహిస్తున్నారు. వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు.ఏ సర్టిఫికెట్ లభించింది. ‘ఈ సినిమాలో నారా రోహిత్ సిన్సియర్ న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపిస్తారు. వ్యవస్థలోని అన్యాయాలపై ఆయన చేసిన పోరాటం ఏమిటన్నదే ఈ చిత్ర కథాంశం.
ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నది. చక్కటి సామాజిక సందేశంతో ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. సిరిలెల్ల, దినేష్తేజ్, సప్తగిరి, జిషు సేన్గుప్తా, సచిన్ ఖేడేకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నాని చమిడిశెట్టి, సంగీతం: మహతి స్వరసాగర్, నిర్మాతలు: కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు తోట, సురేంద్రనాథ్ బొల్లినేని, దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు.