రాయ్పూర్ : పిల్లలను అపహరించే వ్యక్తి అనుకొని ఓ బిచ్చగాడిని తీవ్రంగా చితకబాదారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలో శుక్రవారం చోటు ఆలస్యంగా వెలుగు చూసింది. దుర్గ్ జిల్లాలోని ఓ గ్రామంలోకి బిచ్చగాడు ప్రవేశించాడు. అతను అడుక్కునేందుకు రాగా, ఆ బిచ్చగాడిని కిడ్నాపర్గా స్థానికులు భావించారు. దీంతో అతనిపై దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టారు. కాళ్లతో తన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ గ్రామానికి చేరుకుని, బిచ్చగాడిని చేరదీశారు. గాయాలపాలైన బాధిత వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బిచ్చగాడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
అయితే అనుమానాస్పద వ్యక్తులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు తమకు సమాచారం అందించాలని స్థానికులకు పోలీసులు సూచించారు. అంతే కాని చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని పోలీసులు హెచ్చరించారు. బిచ్చగాడిని చితకబాదిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.