పెద్దపల్లి : న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి దంపతుల హత్య కేసులో 6వ నిందితుడైన వి. వసంతరావుకు హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. వసంతరావు దాఖలు చేసిన బెయిలు పిటిషన్పై జస్టిస్ కె.లలిత విచారణ చేపట్టి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేశారు.
వ్యక్తిగత పూచీకత్తు రూ.50 వేలతో పాటు అంతే మొత్తానికి మరో ఇద్దరి పూచీకత్తులను సమర్పించాలని ఆదే శించారు. వసంతరావు పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించరాదని షరతు
విధించారు.