న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఆటోడ్రైవర్ ఆమెను అమానుషంగా కడతేర్చిన ఘటన ఢిల్లీలోని తుగ్లకాబాద్ ఎక్స్టెన్షన్లో వెలుగుచూసింది. భార్య ప్రవర్తనపై అనుమానంతో నిందితుడు కుక్కర్, సిలిండర్తో ఆమె తలపై బాదడంతో తీవ్రంగా గాయపడిన బాధితురాలు మరణించింది.
నిందితుడిని తుగ్లకాబాద్ ఎక్స్టెన్షన్కు చెందిన ఆటోడ్రైవర్ హసిం ఖాన్ (26)గా గుర్తించామని పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం నిందితుడు హసీం ఖాన్ గోవింద్పురి పోలీస్ స్టేషన్కు వచ్చి తన భార్యను తాను చంపానని చెప్పడంతో పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. ఘటనా స్ధలంలో హసీం భార్య షహీన్ ఖాన్ (20) రక్తపు మడుగులో పడి ఉంది.
సల్మాన్ అనే వ్యక్తితో తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని నిందితుడు అనుమానించాడు. హత్యకు ఉపయోగించిన కుక్కర్, సిలిండర్ను పోలీసులు సీజ్ చేశారు. 2018లో హసీం, షహీన్కు వివాహం కాగా ఇద్దరికీ సంతానం లేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు హసీం ఖాన్ను అదుపులోకి తీసుకున్నారు.