ముంబై : దేశ వాణిజ్య రాజధానిలో మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయి. ఆటోలో ప్రయాణిస్తున్న నర్సుపై ఆటో డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. బాధితురాలు అంధేరిలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది.
ఫిబ్రవరి 17న ఆస్పత్రిలో నైట్ షిఫ్ట్ పూర్తిచేసుకున్న తర్వాత నర్సు (24) బస్టాప్లో బస్ కోసం వేచిచూస్తుండగా ఆటో డ్రైవర్ లిఫ్ట్ ఇస్తానని ముందుకొచ్చాడు. షేర్ ఆటో రేటుకు అంధేరి రైల్వే స్టేషన్ వద్ద డ్రాప్ చేస్తానని చెప్పగా ఆమె అంగీకరించింది. అంధేరి రైల్వే స్టేషన్కు తీసుకెళ్లకుండా జుహు గుల్మొహర్ రోడ్డులో నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లాడు.
ఆ ప్రాంతంలో ఆటోను నిలిపివేసి ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించాడు. సాయం కోసం బాధితురాలు కేకలు వేయడంతో వాహనంలో పారిపోయాడు. ఆటో నెంబర్ను ఆమె నోట్ చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.