కరీంనగర్ : జిల్లాలోని వీణవంక మండలం ఇప్పలపల్లి గ్రామంలో బాల్యవివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. ఇప్పలపల్లి గ్రామానికి చెందిన చుక్క తిరుమల, సమ్మయ్య దంపతుల చిన్న కూతురుకు బాల్యవివాహం చేస్తుండగా సమాచారం అందుకున్న ఐసీడీఎస్ సీడీపీవో అధికారులు అక్కడికి చేరుకున్న వివాహాన్ని నిలిపివేశారు.
చిన్న వయసులో వివాహాలు జరిపిస్తే నష్టాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. బాల్య విహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. ఎవరికైనా 18 ఏండ్లు నిండాకే వివాహం జరిపించాలన్నారు. అప్పుడే వారికి పుట్టే సంతానం కూడా ఆరోగ్యంగా ఉంటాన్నారు.