అమరావతి : చిత్తూరు జిల్లా రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది . భార్య వసుంధర, భర్త రవీచందర్లో మధ్య తలెత్తిన ఘర్షణలో భర్తను హత్య చేసింది భార్య. భర్త తలను నరికి నేరుగా రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. పోలీసులు వారి ఇంటికి వెళ్లి శవ పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.