శంషాబాద్ రూరల్ : ఆన్లైన్లో క్రికేట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న ముఠాను శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మీడియాకు తెలిపారు.
సోమవారం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ జగదీశ్వర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లిలో నివాసముండే విజయ్కుమార్ గతకొంత కాలం నుంచి ఓ ముఠాను ఏర్పాటు చేసుకొని ఆన్లైన్ ద్వారా క్రికేట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు.
ఎవ్వరికి అనుమానం రాకుండా ముఠా సభ్యులు క్రికేట్ మజా, క్రికేట్ బుజ్, లైవ్లైన్ గురు తదితర పేర్లతో ఆన్లైన్ ద్వారా గతకొంతకాలం నుంచి బెట్టింగ్లు నిర్వహిస్తు ఆమాయకుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. పక్క సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్వోటీ పోలీసులు ఆదివారం భారత్, విండీస్ మధ్య జరుగుతున్న మ్యాచ్ పై దృష్టి పెట్టారు.
ఈ తరుణంలో శంషాబాద్లోని పుల్లారెడ్డి స్వీట్హౌజ్ వద్ద ఉండి బెట్టింగ్కు సంబంధించిన ఫోన్ మాట్లాడుతుండగా ప్రధాన నిందితుడు విజయ్ని ఆదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. అతడితో పాటు 10లక్షల తొమ్మిదివేల రూపాయల నగదు, 14 ఫోన్లు, (11 కీప్యాడ్ ఫోన్లు, 3 స్మార్ట్ఫోన్లు) నోట్బుక్ ,టీవీ ,ద్యిచక్ర వాహనం (TS09EQ8601), మొత్తం 11,50,000 రూపాయలు విలువ చేసే వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మరో ముగ్గురు కపిల్, అనిల్, శశి పరారీలో ఉన్నారు. త్వరలో వారిని ఆరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రధాన నింధితుడిపై గతంలో క్రికేట్ బెట్టింగ్ కేసులు ఉన్నాయి. పీడియాక్టు నమోదు చేస్తామని తెలిపారు. మీడియా సమావేశంలో ఏసీపీ భాస్కర్గౌడ్, సీఐ విజయ్కుమార్, ఎన్వోటి సీఐ వెంకట్రెడ్డి,ఎస్ఐ రవి టీమ్ సభ్యులు ఉన్నారు. టీమ్ సభ్యులకు డీసీపీ జగదీశ్వర్రెడ్డి నగదు రివార్డులను అందజేశారు.