Rajasthan | ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల ఆత్మహత్య (Prevent Suicides)లు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో విద్యార్థి తనువు చాలించాడు.
ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్కు చెందిన మహ్మద్ జైద్ మెడికల్ కళాశాల ప్రవేశ పరీక్ష అయిన నీట్కు సన్నద్ధమవుతున్నాడు. జవహర్నగర్ హాస్టల్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను గతంలో ఒక సారి నీట్ తప్పి.. రెండోసారి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Air India | భద్రతా నిబంధనల ఉల్లంఘన.. ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా
Cheetah | మూడు కాదు.. నాలుగు కూనలకు జన్మనిచ్చిన నమీబియా చీతా
Emmanuel Macron | రేపు జైపూర్కి ఫ్రాన్స్ అధ్యక్షుడు.. ప్రధాని మోదీతో కలిసి నగరంలో పర్యటన