ఎర్రుపాలెం:మండల పరిధిలోని పెగళ్లపాడు గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ పార్శపు సుశీల(52) గురువారం గుండెపోటుతో మృతిచెందారు. ఆమె భౌతికకాయానికి టీఆర్ఎస్ నాయకులు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు పంబి సాంబశివరావు, పెద్దగోపవరం ఎంపీటీసీ సగ్గుర్తి కిషోర్బాబు, టీఆర్ఎస్ మండల నాయకులు దేవరకొండ చిరంజీవి, వెంకట్రాములు, వేల్పుల సుధాకర్, ప్రసాద్ లు సందర్శించి మృతురాలి కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.