మారేడ్పల్లి : పట్టాల పక్కన నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొట్టడడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…సఫిల్గూడ, రామకృష్ణపురం రైల్వే స్టేషన్ల మధ్యన గుర్తు తెలియని వ్యక్తి రైలు పట్టాల పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి రైలు రాకను గమనించకపోవడంతో రైలు ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రైల్వేపోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చూరీకి తరలించారు. మృతుని వయసు సూమారు 50 సంవత్సరాలు ఉంటాయని తెలిపారు. మృతుని సంబంధీకులు ఉంటే సికింద్రాబాద్ రైల్వే పోలీసుస్టేషన్లో సంప్రదించాలని పోలీసులు కోరారు.