మైలార్దేవ్పల్లి :గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ ఐ రవీందర్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని టాటానగర్లో ఓ రేకులతో ఉన్న ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తి (35)ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి చూడగా గత మూడు నాలుగు రోజుల క్రితం ఉరి వేసుకోని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉన్నది.