చార్మినార్ : అక్రమ సంబంధ వ్యవహారం ఓ వ్యక్తి ఆత్మహత్యకు దారితీసింది. హుస్సేని అలం ఇన్స్పెక్టర్ జీ.నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం హసన్నగర్ ఇందిరానగర్కు చెందిన జాఫర్ ఖురేషీ (26) స్థానికంగా దస్తగిరి స్వీటుషాపు నిర్వహిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు.
ఈ క్రమంలో స్థానికంగా నివసించే ఓ మహిళతో జాఫర్ఖురేషీ సన్నిహితంగా ఉండేవాడు. ఈ విషయాన్ని సదరు మహిళ భర్త ఖాజాడాన్ గుర్తించి జాఫర్ ఖురేషీని బెదిరించాడు. అయినా జాఫర్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో జాఫర్ ఖురేషీ పద్దతిలో మార్పురాకుంటే హతమారుస్తానంటూ ఖాజాడాన్ హెచ్చరించాడు.
దీంతో ఆందోళనకు గురైన జాఫర్ఖురేషీ భయపడి గత ఐదు రోజుల క్రితం హుస్సేని అలం పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే తన బంధువుల ఇంటికి వచ్చాడు. తీవ్ర ఆందోళనకు గురైన జాఫర్ఖురేషీ ఆత్మహత్యకు పూనుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ జీ.నరేష్కుమార్ తెలిపారు.