హైదరాబాద్ : మద్యం తాగడానికి భార్య డబ్బులు ఇవ్వలేదని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ పీ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్పేట
పటేల్నగర్కు చెందిన డీ శంకరయ్య (30), యాదమ్మ భార్యాభర్తలు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరూ దినసరి కూలీలుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గత కొంత కాలంగా శంకరయ్య మద్యానికి బానిసగా మారాడు.
మద్యానికి డబ్బులు ఇవ్వాలని సోమవారం సాయంత్రం భార్యతో భర్త గొడవకు దిగాడు. డబ్బులు ఇచ్చేందుకు భార్య నిరాకరించడంతో.. ఆవేశంతో యాసిడ్ తాగేశాడు. అనంతరం తన భార్యకు యాసిడ్ తాగిన విషయాన్ని చెప్పాడు. శంకరయ్యను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.