అబ్దుల్లాపూర్మెట్ : కారు అదపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న సంఘటన శుక్రవారం అబ్దుల్లాపూర్మెట్ పోలిస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగోల్ ఆనంద్నగర్కు చెందిన నైకోటి మోహన్రెడ్డి(72) ఏపి28డిడి0485 నంబర్ గల తన కారులో పని నిమిత్తం చౌటుప్పల్ వెళ్లాడు. పని ముగించుకొని నగరానికి వస్తుండగా అబ్దుల్లాపూర్మెట్ సమీపంలోని సంజయ్గాంధీ పాలిటెక్నిక్ కళాశాల వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్ పై ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో మోహన్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.