ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తాటిగూడలో జరిగిన కాల్పుల ఘటనలో తుది తీర్పును జిల్లా కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది.వివరాల్లోకి వెళ్తే..గతేడాది డిసెంబర్ 18న ఆదిలాబాద్కు చెందిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ తను నివాసం ఉంటున్న తాటిగూడ ప్రాంతంలో చిన్నారుల గొడవకు సంబంధించి సమీపంలో ఉన్న మాజీ కౌన్సిలర్ జమీర్ తో పాటు మరో ఇద్దరిపై తుపాకులతో కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో గాయపడిన జమీర్ హైదరాబాద్లో చికిత్స పొందుతూ మరణించారు. ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి సాక్షులను ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు ఈరోజు వెలువరించాల్సి ఉండగా.. న్యాయస్థానం ఈనెల 24కు వాయిదా వేసింది.