ఆదిలాబాద్ : నిర్మల్ జిల్లా భైంసాలో ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్పై భైంసా పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలోని కోర్భగల్లిలో గతంలో జరిగిన అలర్లలో ఇండ్లు కోల్పోయిన పది కుటుంబాలకు సేవా భారతి ఆధ్వర్యంలో ఇండ్లు నిర్మించి ఇచ్చారు. బుధవారం సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించారు.
స్థానిక భట్టిగల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ సోయం బాపురావ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీపై 153/ఏ, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సరిహద్దు సమీపంలో.. రెండు పాక్ ఎయిర్బేస్లు
టాస్ గెలిచిన జో రూట్.. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్