ఖమ్మం: డబ్బుల కోసం దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నగరంలోని ట్రాన్స్ జెండర్లకు ఖమ్మం టౌన్ ఏసీపీ ఆంజనేయులు హెచ్చరించారు. నగరంలోని ట్రాన్స్ జెండర్లకు గురువారం ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలోట్రాన్స్ జెండర్స్ కొంత మంది ఎక్కడ శుభకార్యం జరిగినా వారి ఇంటి ముందు వాలిపోయి డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే పిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.
ఇటీవల కాలంలో ఇంటి యజమానులపై దుర్భాషలాడుతూ దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుల వస్తున్నాయన్నారు. జీవన ఉపాధి కోసం కూలి పనులు చేసుకుని జీవించాలే తప్ప ఇతరుల దౌర్జన్యంగా శ్రమ దోచుకోవటం అనైతికమని, తమ వైఖరి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు. ఎవరైనా ఇటువంటి వేధింపులకు గురైతే బాధితులు వెంటనే డయల్ 100 టోల్ ఫ్రీ నెంబర్కు, స్ధానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.