మంచిర్యాల : జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియా ఎస్సార్పీ-3 భూగర్భ బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 21 డిప్ 24 లెవల్ వద్ద పైకప్పు కూలడంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో కృష్ణారెడ్డి, సత్యనారాయణ, లచ్చయ్య, చంద్రశేఖర్ మరణించినట్లు సమాచారం. మొదటి షిఫ్ట్ విధులు నిర్వహిస్తుండగా పైకప్పు కూలినట్లుగా తెలుస్తున్నది. గని వద్ద ఉద్రిక్తత పరిస్థితితులు నెలకొన్నాయి. కాగా, సింగరేణి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.