హైదరాబాద్ : కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలోని హైదర్నగర్లో దారుణం జరిగింది. స్థానికంగా ఉన్న శ్మశాన వాటిక వద్ద ఓ యువకుడిని హత్య చేసి కాల్చేశారు దుండగులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు. ఘటనాస్థలిలో క్లూస్ టీం ఆధారాలను సేకరిస్తోంది. మృతదేహానికి కొద్ది దూరంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. రేపు అమావాస్యతో పాటు సూర్యగ్రహణం కావడంతో.. నరబలి ఇచ్చి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.