భద్రాద్రి కొత్తగూడెం : ఒకప్పుడు ఆ ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. అయితే ఆమెకు మరొకరితో నిశ్చితార్థం జరిగింది. దీన్ని ఆసరాగా చేసుకున్న ఆ యువకుడు.. సదరు యువతిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. రూ. 5 లక్షలు ఇవ్వకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని ఆమెను బెదిరింపులకు గురి చేస్తున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. దమ్మపేట మండలం మందాలపల్లికి చెందిన కే అమర్.. ఓ యువతితో పరిచయం ఏర్పర్చుకున్నాడు. ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ సమయంలో యువతికి తెలియకుండా ఫోటోలను, వీడియోలను చిత్రీకరించాడు. అయితే ఇటీవలే ఆమెకు మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఇక అమర్.. ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.
మొదటగా సన్నిహితంగా ఉన్న ఫోటోలను ఆమెకు కాబోయే భర్తకు పంపించాడు. రూ. 5 లక్షలు ఇవ్వకపోతే ఆ వీడియోలను కూడా వైరల్ చేస్తానని బెదిరింపులకు గురి చేస్తున్నాడు. చేసేదేమీ లేక బాధిత యువతి.. దమ్మపేట పోలీసులకు అమర్పై శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమర్తో పాటు అతని స్నేహితులు ధర్మారావు, అనిల్, వెంకటేశ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.