సంగారెడ్డి అర్బన్ : బైక్ అదుపు తప్పి యువకుడి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన గురువారం ఉదయం సంగారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. పాశామైలారం పెన్నేస్ట్ పరిశ్రమలో పని చేస్తున్న దివిటి అనిల్కుమార్ (26) నైట్ డ్యూటీ ముగించుకొని ఇదే పరిశ్రమలో పనిచేసే మరో ఇద్దరు స్నేహితులు అభిలాష్, విష్ణువర్ధన్తో కలిసి సంగారెడ్డి వస్తున్నాడు.
వీరి బైక్ ఐటిఐ ముందుకు రాగానే అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టడంతో అనిల్కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అభిలాష్, విష్ణువర్ధన్లకు తీవ్ర గాయాలు కాగా పట్టణంలోని ప్రైవేట్ దావాఖానకు తరలించారు. ఇందులో విష్ణువర్ధన్ పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు తెలిపారు.
వికారాబాద్ జిల్లా అలంపూర్ గ్రామానికి చెందిన మృతుడు అనిల్కుమార్ సంగారెడ్డి మండల పరిధిలోని కల్పగూర్లో తల్లితో కలిసి ఉంటున్నాడు. మృతుడి తల్లి భూదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.