హైదరాబాద్ : హైదరాబాద్ శివారు ప్రాంతంలోని నార్సింగిలో విషాదం నెలకొంది. ఓ అపార్ట్మెంట్లోని స్విమ్మింగ్పూల్లో పడి ఓ 14 ఏండ్ల యువకుడు మృతి చెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన పీ శ్యామ్(14).. కోకాపేట్లో తమ బంధువుల గృహ ప్రవేశానికి వచ్చాడు. గృహ ప్రవేశం జరిగిన అనంతరం.. అక్కడే ఉన్న స్విమ్మింగ్పూల్ వద్ద పిల్లలందరూ ఆడుకుంటున్నారు. శ్యామ్ కూడా అక్కడే ఉండగా.. అదుపుతప్పి స్విమ్మింగ్పూల్లో పడిపోయాడు. అప్రమత్తమైన బంధువులు అతన్ని బయటకు లాగి ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్యామ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.