మేడ్చల్ : మేడ్చల్ పరిధిలోని రాజబొల్లారంలో విషాదం నెలకొంది. కుటుంబ సమస్యలతో ముగ్గురు పిల్లలతో పాటు తల్లి చెరువులో దూకింది. తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మరో బాబు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.