Hyderabad | హైదరాబాద్ : న్యూ బోయిన్పల్లిలోని నూతన కాలనీలో దారుణం జరిగింది. ఓ కుటుంబంపై ఓ వ్యక్తి కొడవలితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
నూతన కాలనీలో నివసిస్తున్న కిరణ్ ఇంటికి తన సోదరి ఝాన్సీ రాణి వచ్చింది. అయితే రాణి భర్త సత్యనారాయణ.. కిరణ్ ఇంటికి ఈ ఉదయం వచ్చాడు. ఇక తన వెంట తెచ్చుకున్న కొడవలితో భార్య రాణిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డొచ్చిన కిరణ్, ఆయన భార్య షీలాపై కూడా సత్యనారాయణ కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అప్రమత్తమైన స్థానికులు.. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సత్యనారాయణ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు కుటుంబ వివాదాలే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.