మెహిదీపట్నం : నాలాలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన హుమాయూన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..మాసాబ్ట్యాంక్ ఎంజీనగర్ ఒవైసీ పురాలో నివసించే ఎ.మధుసూదన్(50)చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవిస్తుండేవాడు. ఇతడికి భార్య పద్మ,కుమారుడు రామకృష్ణ, కూతురు కవిత ఉన్నారు.
గత కొన్నినెలలుగా మధుసూదన్ ఇంటికి కూడా వెళ్లడం లేదు. ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రం తాగిన మైకంలో మాసాబ్ట్యాంక్ పెన్షన్ఆఫీస్ పక్కనే ఉన్న బుల్కాపూర్ నాలాలో ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. అందులోనుంచి బయటకు రాలేక నాలాలో మునిగి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహా న్ని నాలాలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.