హైదరాబాద్ : భార్య పుట్టింటికి వెళ్లిందని తీవ్ర మనస్తాపంతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పీ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్అంబర్పేట పోచమ్మబస్తీకి చెందిన రావుల అంజయ్య కుమారుడు రావుల కృష్ణ(30)కు కొన్నేండ్ల క్రితం పావని అనే అమ్మాయితో వివాహమైంది. వీరికి కుమార్తె రుతికశ్రీ(4) ఉంది.
అయితే గత కొంతకాలం నుంచి భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఓ రెండుసార్లు కృష్ణ ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే గత నెల 26వ తేదీన పావని తన కూతుర్ని తీసుకొని పుట్టింటికి వెళ్లింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కృష్ణ మంగళవారం తెల్లవారుజామున తన ఇంటి రెండో అంతస్తు నుంచి కిందకు దూకాడు. తీవ్ర గాయాలపాలైన కృష్ణను ఉస్మానియా దవఖానాకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కృష్ణ సోదరుడు ఆనంద్కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.