యాదాద్రి భువనగిరి : రామన్నపేట మండలం దుబ్బాక వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.