కాచిగూడ : రోడ్డు డివైడర్కు ఢీకొని సెంట్రింగ్ కార్మికుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై బద్దం నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నల్లకుంట డివిజన్ గోల్నాకలోని వెంకటేశ్వరనగర్ ప్రాంతా నికి చెందిన నల్ల నరేందర్ (40) వృత్తిరిత్యా సెంట్రింగ్ కార్మికుడు. బుధవారం భార్యతో గొడవపడి ఇంట్లోంచి వెళ్లిన నరేందర్ రాత్రి వరకు మద్యం సేవించాడు.
గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో టీఎస్ 09 ఎఫ్ఎల్ 5247 హీరోహోండా ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తూ తాగిన మైకంలో కాచిగూడ కబేళా బ్రిడ్జి డివైడర్కు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు, క్లూస్ టీం సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్ట్మార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు. భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.