బేగంపేట్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు మీద క్యూ న్యూస్ యూ ట్యూబ్ ఛానెల్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అనుచిత వాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్పై ఆదివారం బేగంపేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న ఆదేశాల మేరకు బోయినపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, వార్డ్ ప్రెసిడెంట్ కుమార్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి ధనరాజ్, ఉపాధ్యక్షుడు నరసింహాలతో కూడిన బృందం బేగంపేట్ పోలీస్టేషన్ సీఐ శ్రీనివాసులుకు తీన్మార్ మల్లన్న పై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు చేసిన వారిలో టీఆర్ఎస్ విద్యార్ధి విభాగం నాయకులు చంద్రకాంత్, భరత్, నవీన్, రవికాంత్ తదితరులు ఉన్నారు.