గ్వాలియర్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ పట్టణంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎయిర్ఫోర్స్ వాచ్ టవర్పై సెంట్రీగా విధులు నిర్వహిస్తున్న 54 ఏండ్ల వ్యక్తి సర్వీస్ రైఫిల్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, అతని ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాము వెళ్లేసరికి మృతదేహం మెట్లపై పడి ఉన్నదని, ఛాతి మీద రైఫిల్ ఉన్నదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు.