Tamil Nadu | చెన్నై : తమిళనాడులోని కాంచీపురం( kanchipuram )లో ఘోరం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ బాణసంచా పరిశ్రమ( Crackers Factory ) లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో పని చేస్తున్న 8 మంది కార్మికులు తమ ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎగిసిపడుతున్న మంటలను ఫైరింజన్ల సహాయంతో అదుపు చేశారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.