హైదరాబాద్ : హైదరాబాద్లోని బాలానగర్లో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో 246 కిలోల గంజాయి తరలిస్తున్నట్లు ఎస్వోటీ పోలీసులకు పక్కా సమాచారం అందింది. మెదక్ జిల్లాలోని రాయికోడ్ నుంచి మేడ్చల్కు తరలిస్తుండగా బాలానగర్ వద్ద ఆ వాహనాన్ని ఆపి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి మూడు సెల్ఫోన్లను సీజ్ చేశారు. ప్రదీప్(27), చంటి(27)అని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే రాయికోడ్ నుంచి మొగులయ్య, సిద్ధు అనే వ్యక్తి కలిసి గంజాయిని మేడ్చల్ జిల్లాకు పంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.