కోల్కతా : బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు మహిళలను పశ్చిమ బెంగాల్కు చెందిన ఉత్తర 24 పరగణాల జిల్లాలో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) బృందం అరెస్ట్ చేసింది. మహిళలను మౌసమి అధికారి, లినా గోస్వామిగా గుర్తించిన అధికారులు వారి నుంచి రూ 1.5 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాసత్, బద్గర్ ప్రాంతాలకు చెందిన వారని డీఆర్ఐ టీం తెలిపింది. బంగారం స్మగ్లింగ్ జరుగుతోందనే సమాచారంతో బుధవారం రాజధాని ఎక్స్ప్రెస్పై జల్పాయిగురి స్టేషన్లో రైల్వే సెక్యూరిటీ సిబ్బంది, డీఆర్ఐ బృందం దాడులు జరపడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.
మహిళల వద్ద సోదా చేయగా బంగారు బిస్కెట్లు, బ్లాక్ బ్యాగ్లో దాచిన బంగారం పట్టుబడింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ మార్కెట్లో రూ కోటిన్నర వరకూ ఉంటుంది. అరెస్ట్ చేసిన మహిళలను గురువారం సిలిగురి కోర్టులో హాజరుపరిచారు.