మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కోణార్క్ ఎక్స్ప్రెస్ ఇద్దరు ట్రాక్మెన్లను ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. మహబూబాబాద్ శివారు ప్రాంతంలో ఎండీ పాషా(40), కమలాకర్ చారి(36) కలిసి ట్రాక్పై పనులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఒకటో ట్రాక్పై రైలు రావడంతో.. రెండో ట్రాక్పైకి వెళ్లారు.
ఆ సమయంలోనే విజయవాడ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ వేగంగా వచ్చి ఇద్దరు ట్రాక్మెన్లను ఢీకొట్టడంతో వారు చనిపోయారు. ఒకేసారి రెండు రైళ్లు రావడం, ట్రాక్మెన్లు గమనించకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.