నిజామాబాద్ : వారిద్దరూ వరుసకు అన్నాచెల్లెలు అవుతారు. ఫ్రెండ్స్ మాత్రం వారిని ప్రేమికులుగా అనుమానించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారు. యువకుడు మృతి చెందగా, యువతీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నందిపేటలో చోటు చేసుకుంది.
మృతుడిని వినయ్ కుమార్గా పోలీసులు గుర్తించారు. తమను ప్రేమికులని ముద్ర వేయడంతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.