Rajanna Siricilla | రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల గ్రామ శివారులోని అగ్రికల్చర్ కాలేజీ వద్ద ఆటో – లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో 11 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. బాధితులంతా జగిత్యాల జిల్లా బల్వంతపూర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు. వీరంతా మల్లన్న దర్శనానికి వెళ్లి ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, క్షతగాత్రులను సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు.