రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు వెంట ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గండిపేట సీబీఐటీ కళాశాల వద్ద ఇవాళ మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మృతి చెందిన విద్యార్థుల వివరాలు తెలియాల్సి ఉంది.