ముంబై : చేప కొనుగోలు విషయంలో తలెత్తిన గొడవతో తన బంధువును హత్య చేసిన యువకుడి (19)ని థానే జిల్లా డొంబివలిలో ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. కల్యా అలియాస్ హితేష్ నక్వాల్ చేప వ్యవహారంలో శనివారం రాత్రి తన బంధువు భానుదాస్ అలియాస్ ముకుంద్ దత్ చౌధరి(55)తో గొడవపడ్డాడు.
ఘర్షణ జరిగిన అనంతరం ముకుంద్ను డొంబివలిలోని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లిన హితేష్ పదునైన ఆయుధంతో అతడి మెడపై దాడిచేశాడు. ఘటన సమాచారం అందగానే అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుడిని దవాఖానకు తీసుకువెళ్లగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.