హైదరాబాద్ : ఈ రోజుల్లో పిల్లలు చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటున్నారు.. ఏ విషయంలోనైనా వాళ్లు అనుకున్నది జరగాల్సిందే.. జరగకపోతే ఎంతకైనా తెగిస్తారు.. ఇలానే సెల్ఫోన్ చూడొద్దంటూ తల్లి మందలించిందన్న కోపంతో.. ఏకంగా ప్రాణాలే తీసుకుంది ఓ కూతురు. ఈ ఘటన హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ధూళపల్లి గ్రామానికి చెందిన మూర్తి కూతురు సాధన (17) నిత్యం ఫోన్ పట్టుకుని ఉంటుంది.. కూతురు ఎప్పుడు సెల్ఫోన్ పట్టుకుని ఉండటాన్ని గమనించిన తల్లి గట్టిగా మందలించింది.
అయితే తల్లి మాటలకు కోపానికి గురైన సాధన.. మనస్తాపానికి గురై ఫోన్ ఆఫ్ చేసి పడుకుంటున్నానని చెప్పి.. నేరుగా తన గదిలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంతసేపటి తర్వాత గదిలోకి వెళ్లి చూసిన తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో ఉన్న కూతురును.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
ఇక ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.