హైదరాబాద్లోని చందానగర్లో13 ఏండ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. సోమవారం ఉదయం మిస్ అయ్యాడు 13 ఏండ్ల అక్షిత్ మిస్ అయ్యి 24 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. ఒక రోజు గడిచినా బిడ్డ కనిపించకపోవడంతో అక్షిత్ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అక్షిత్ మిస్సింగ్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
అక్షిత్ తల్లిదండ్రులకు ఎవరితోనైనా విభేదాలున్నాయా..? కావాలనే ఎవరైనా కిడ్నాప్ చేశారా..? లేదంటే అతనే ఎక్కడికైనా వెళ్లాడా..? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్షిత్ ఎక్కడున్నాడో అంటూ తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. ప్రజలు కూడా అక్షిత్ జాడ కోసం సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా విచారణ జరుగుతున్నది.