మహబూబాబాద్: జిల్లాలోని ఆమన్గల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ డోరు ఊడిపోవడంతో అందులో ఉన్నవారు కిందపడిపోయారు. దీంతో 12 మంది గాయపడ్డారు. మిరప కాయలు ఏరడానికి ఆమన్గల్ నుంచి ట్రాక్టర్లో కూలీలను తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆమన్గల్ శివారులో ట్రాక్టర్ డోరు ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో కూలీలు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 అంబులెన్సులో మహబూబాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.