శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు 10 లక్షల సౌదీ రియాల్ (కరెన్సీ) స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల వివరాల ప్రకారం.. జి9 459 విమానంలో హైదరాబాద్ నుంచి షార్జా వెళ్తున్న ఓ ప్రయాణీకుడు 10 లక్షల సౌదీ రియాల్స్ను అతని బ్యాగులో అక్రమంగా తరలిస్తుండగా సిఐఎస్ఎఫ్ తనిఖీలో పట్టుకున్నారు.
రియాల్తో పాటు నిందితున్ని కస్టమ్స్ కు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.