అమరావతి : ఆగిఉన్న లారీని ప్రైవేట్ బస్సు ఢీ కొన్న సంఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డ సంఘటన శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమడోలు జంక్షన్ వద్ద జరిగింది. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వైపు 25 మంది ప్రయాణికులతో బయలుదేరిన ప్రైవేట్ బస్సు భీమడోలు జంక్షన్ వద్ద ఆగిఉన్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో గాయపడ్డ వారిని భీమడోలు పోలీసులు 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.