గోధుమ పిండి: పావుకిలో
నెయ్యి లేదా నూనె: టేబుల్ స్పూను
వాము: పావు స్పూను
పల్లీలు: రెండు టేబుల్ స్పూన్లు
పచ్చిమిరపకాయలు: రెండు
వెల్లుల్లి రెబ్బలు: పది పదిహేను
కొత్తిమీర: నాలుగు రెబ్బలు
ముందుగా గోధుమ పిండిని తీసుకొని అందులో కొద్దిగా నూనె లేదా నెయ్యిని చుట్టూ తిప్పినట్టుగా పోసుకోవాలి. కొద్దిగా వాము, తగినంత ఉప్పు కలిపి, పైన నీళ్లు చల్లాలి. ఇప్పుడు దీన్ని చపాతీ పిండిలా ముద్దగా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలను వేయించుకొని, వెల్లుల్లి పాయల్ని ఒలుచుకోవాలి. ఇప్పుడు మిక్సీలో పచ్చిమిరపకాయలు, వేయించిన పల్లీలు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బల్ని వేసి రెండు తిప్పులు తిప్పాలి.
ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని గుండ్రంగా ఒత్తుకోవాలి. దాని పైన నూనె రాసి, పొడిపిండిని పూతలా పూయాలి. దీని పైన ఇందాక మిక్సీ పట్టిన పల్లీల మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని పరచినట్టుగా రాయాలి. ఇప్పుడు ఒత్తిన రొట్టెను గుండ్రంగా రోల్ లాగా మడుచుకోవాలి. దీన్ని మధ్యకు కోసి పరాఠాలా కాస్త మందంగా ఒత్తుకోవాలి. పెనం మీద కొద్దిగా నెయ్యి లేదా నూనెతో కాలిస్తే థేచా లచ్చా పరాఠా సిద్ధమైపోతుంది.