పచ్చిరొయ్యలు: ఒక కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి (పెద్దది), పచ్చిమిర్చి: నాలుగు, కరివేపాకు: రెండు రెబ్బలు, కారం: రెండు టీస్పూన్లు, పసుపు: అర టీస్పూన్, ధనియాల పొడి: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: అర కప్పు, జీలకర్ర పొడి: అర టీస్పూన్, కొత్తిమీర తురుము: కొద్దిగా.
ముందుగా రొయ్యలను శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి గంటపాటు నానబెట్టాలి. గంట తర్వాత రొయ్యల్లో నీళ్లుపోసి కడగాలి. ఒక గిన్నెలో రొయ్యలు, ఒక టీస్పూన్ కారం, కొంచెం పసుపు వేసి పది నిమిషాలు పక్కన పెట్టాలి. కడాయిలో నూనె వేడయ్యాక రొయ్యల్ని వేసి సన్నని మంటపై వేయించి తీయాలి. అదే కడాయిలో సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి.. దోరగా వేగాక రొయ్యలను జోడించి మరికాసేపు వేయించాలి. దీంట్లో కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్రపొడి, ఉప్పు కలిపి సన్నని మంటపై మరో రెండు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. చివరగా కొత్తిమీర తురుము వేసుకుంటే పచ్చిరొయ్యల వేపుడు సిద్ధం.