ఒకప్పుడు నచ్చిన స్నాక్స్నుంచి స్పైసీ మీల్స్వరకు అన్నిటినీ చిటికెలో ఆర్డర్ చేసి తెప్పించుకునేవారు. వీకెండ్స్లో అయితే ఫ్యామిలీని రెస్టారెంట్లకు తీసుకెళ్లేవారు. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటి భోజనానికే అందరూ మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇంట్లో కొన్ని వంటలను ఎక్కువ మోతాదులో చేసేసి, మిగిలింది ఫ్రిజ్లో పెడుతుంటారు. ఇమ్యూనిటీ పెంచుకోవాల్సిన టైమ్లో మిగిలిన ఆహారాన్ని వేడి చేసుకుని తింటే మంచిది కాదని అందరికీ తెలుసు. అయితే, వాటిని తిరిగి ఆరోగ్యకరమైన వంటగా మార్చుకుంటే సమస్యే ఉండదు. ఎలా అంటారా?
అన్నం: చద్దన్నాన్ని నచ్చిన కూరగాయలతో ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. కానీ నూనె తక్కువగా వాడాలి. అదీ వేడివేడిగానే తినాలి. అలాగే, చద్దన్నంతో రైస్ డంప్లింగ్స్ (ఇడ్లీల్లాగా ఉప్పు, కొద్దిగా తినే సోడా వేసి ఆవిరిపై ఉడికించాలి) వేసుకోవచ్చు.
బ్రెడ్: ఒక్కోసారి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడుతున్నా, బ్రెడ్ పీసులు ఇంట్లో అలాగే ఉండిపోతాయి. అప్పుడు బ్రెడ్ వృథా కాకుండా, వాటిని పొడిపొడిగా చేసి ఆరబెట్టాలి. ఆ కరకరలాడే ముక్కల్ని స్నాక్స్ తయారీలో ఉపయోగించొచ్చు.
పప్పు: మిగిలిపోయిన పప్పులో కాస్తంత టమాట రసం పోసి, ‘పప్పుచారు’గా తయారు చేసుకోవచ్చు. దాల్ ధోక్లా కూడా చేయొచ్చు.
పనీర్: పనీర్ మసాలా, పనీర్ కడాయ్, పనీర్ ఫ్రైలో మిగిలిన ముక్కలను బ్రెడ్ లేదా పిజ్జా టాపింగ్స్లా చేసుకుని తినొచ్చు.
పాస్తా: ఒక్కోసారి పిల్లలు పాస్తాను సగం తిని వద్దంటారు. అలా మిగిలిన దాన్ని ముక్కలుగా తరిగి, వాటిపై చిల్లీ ఫ్లేక్స్ వగైరా చల్లుకుని పాస్తా సలాడ్గా మార్చుకోవచ్చు.
చపాతీ: మిగిలిపోయిన చపాతీలను చాకుతో నూడుల్స్లా సన్నగా, పొడుగ్గా తరగాలి. వాటికి నచ్చిన కూరగాయలు, సాస్లు జోడించి నూడుల్స్ తయారు చేసుకోవచ్చు.