బాస్మతి బియ్యం: ఒక కప్పు, తరిగిన క్యారెట్, బీన్స్, పచ్చి బఠాణీ: రెండు టేబుల్ స్పూన్ల చొప్పున, ఆలుగడ్డ: ఒకటి, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, దాల్చిన చెక్క: రెండంగుళాలు, మిరియాలు: అర టీస్పూన్, బిర్యానీ ఆకు: రెండు, అనాస పువ్వు: ఒకటి, ఉప్పు: తగినంత, నెయ్యి: ఒక టేబుల్ స్పూన్, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, పుదీనా, కొత్తిమీర తరుగు: కొద్దిగా,
జీడిపప్పు: పది పలుకులు.
బాస్మతి బియ్యాన్ని బాగా కడిగి అరగంటపాటు నానబెట్టుకోవాలి. స్టవ్మీద కడాయి పెట్టి నెయ్యి, నూనె వేడయ్యాక దాల్చిన చెక్క, మిరియాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకులు వేసి.. వేగాక జీడిపప్పు పలుకులు, తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి చీలికలు జోడించి వేయించాలి. ముక్కలుగా చేసుకున్న ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్, పచ్చి బఠాణీ వేసి రెండు నిమిషాలు వేగాక బియ్యం వేసి ఒకసారి కలుపుకోవాలి. రెండు కప్పుల నీళ్లు, తగినంత ఉప్పు కలిపి.. పైనుంచి పుదీనా, కొత్తిమీర తురుము వేసి మూతపెట్టి పది నిమిషాలపాటు సన్నటి మంటపై ఉడికిస్తే చాలు. ఘుమఘుమలాడే వెజిటబుల్ పులావ్ సిద్ధం.