కావలసిన పదార్థాలు
మైదా: ఒక కప్పు, రాగిపిండి: ఒక కప్పు, వెన్న/వనస్పతి: పావు కప్పు, చక్కెర: పావు కప్పు, ఉప్పు: చిటికెడు, వాము, జీలకర్ర పొడి: అర టీస్పూన్ చొప్పున.
తయారీ విధానం
ముందుగా మైదాలో రాగిపిండి, వనస్పతి వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో చక్కెర, వాము, జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు జోడించి.. కొద్దిగా నీళ్లు చల్లి మృదువుగా కలిపి గాలి చొరబడని కవర్లో పెట్టి అరగంటపాటు పక్కన ఉంచాలి. బాగా నానిన మిశ్రమాన్ని చిన్నచిన్న ముద్దలుగా చేసి గుండ్రని బిళ్లలుగా ఒకే సైజులో ఒత్తుకోవాలి. ఫోర్క్తో బిస్కెట్స్పై అక్కడక్కడా గుచ్చితే సమంగా బేక్ అవుతాయి.
నూనె పూసిన పాత్రలో బిస్కెట్స్ అమర్చి ఇరవై నిమిషాలపాటు 350 డిగ్రీల ఫారెన్హీట్ వద్ద బేక్ చేస్తే ఆరోగ్యకరమైన రాగి బిస్కెట్లు సిద్ధం. బేక్ చేసే ముందు బిస్కెట్స్పై తరిగిన డ్రైఫ్రూట్స్ జతచేసుకోవచ్చు.