సోషల్మీడియాలో జరిగే అసత్య ప్రచారాలు, ట్రోలింగ్పై ఆగ్రహం వ్యక్తం చేసింది యువ కథానాయిక కృతిశెట్టి. తన పనేదో తాను చేసుకుపోతున్నా విమర్శలు రావడం బాధగా ఉందని పేర్కొంది. సాంఘిక మాధ్యమాల్లో నెగెటివ్ వార్తల్ని ప్రచారం చేసేవాళ్ల ఉద్దేశ్యం ఏమిటో తనకు అర్థం కాదని తెలిపింది. ఆమె మాట్లాడుతూ ‘విమర్శల్ని సానుకూల దృక్పథంతో స్వీకరించాలని చెబుతుంటారు. అన్ని సందర్భాల్లో అది సాధ్యం కాదు.
సోషల్మీడియాలో వచ్చే కొన్ని వార్తలు ఆగ్రహాన్ని తెప్పిస్తాయి. అసలు నేను ఏం తప్పు చేశానని ఇంతలా ట్రోల్ చేస్తున్నారనిపిస్తుంది. పుకార్లను వ్యాప్తి చేసే వారు ఒక్కసారి వాళ్ల కుటుంబ కోణంలో ఆలోచించాలి. ఫ్యామిలీ మెంబర్స్పై గాసిప్స్ క్రియేట్ చేస్తే తట్టుకోగలమా అని ఆలోచించుకోవాలి. ఇటీవల నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని, గతంలో మాదిరిగా అందంగా లేనని రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. వయసును బట్టి, సినిమాల మేకప్కు అనుగుణంగా మార్పులు కనిపించడం సహజం. ట్రోల్స్ చేసే వారు కాస్త వివేకంతో ప్రవర్తించాలి’ అని కృతిశెట్టి హితవు పలికింది. ఆమె కథానాయికగా నటించిన ‘కస్టడీ’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.